Wednesday, October 7, 2015

రేపటి సర్వసంగ పరిత్యాగికి
అర్ధరాత్రిపూట తన నిర్ణయాన్ని
ప్రకటించాలన్న కోరిక కలిగింది.
నేనింక సన్యాసాశ్రమంస్వీకరించే
సమయం ఆసన్నమైంది.
ఇంతకాలం ఈ సంసారం ఉచ్చులో పడి
సం యమనాన్ని కోల్పోయాను.ఈ ఉచ్చులో
ఎవరో నన్ను కట్టిపడేసి బందీనిచేసి
మోసం చేసారు,భ్రమలను కల్పించి వంచించారు!



భగవంతుడు సన్నటిస్వరంతో చెప్పాడు.
ఆ వ్యక్తినినేనే సుమా!! అతని చెవులు ఆ
సంభాషణను వినిపించుకోవడం మానేసాయి.


దగ్గరగా పట్టెమంచం మీద
 ఆదమరిచి నిదురిస్తున్న తల్లి
స్తన్యాన్ని గ్రోలుటూ ఆనందాన్నభవిస్తున్న
చంటిపాపాయి-- విప్పారిన సుమంలా ప్రశాంతంగా!!



కొంతసేపటికి మళ్ళీ అతడినుంచి ఓ ప్రశ్న.
ఎవరు నీవు ఇంతకాలం నన్ను
మాయలోపడేసి మోసం చేసావు?
నేను భగవంతుడిని అని ప్రత్యుత్తరం
అతనికిదికూడా వినబడినట్లుగాలేదు.
మౌనమే ఇరువురిమధ్యా
శూన్యాన్ని నిలబెట్టిపోయింది.
పాప కలలో కలవళపడినట్లుంది.
పెద్దగా ఏడుపు లంకించుకుంది.
తల్లికి మరింతాగ్గరగాచేరి
 చీరె కొంగుపట్టుకుని ధైర్యంగా
నిద్రలోకి జారుకుంది.
భగవంతుడు అధికారస్వరం తో అరిచాడు.

మూర్ఖుడా !!ఈగృహాన్ని వదలి ఎక్కడికి పారిపోకు
ఏ ఆశ్రమాన్నీ ఆశ్రయించకు.అతనికేమీ
 వినబడిన దాఖలా కనబడలేదు.


ఏమిటీ ఇంత  తెలివితక్కువవాడా  నా భక్తుడు.

ఎదురుగా నేనుండగనే నాఉనికికోసం వెదుకుతున్నాడు.
ఆమాతృమూర్తి సుఖనిద్రలో నేనే  ఆ చిట్టి పాలబుగ్గల
 పాపాయి నవ్వులోనేను కనబడలేదా మందమతికి
అని చిరుమందహాసాన్ని ప్రకటిస్తూ
పరమ భక్తుడైన  మందమతినిచూసి మూర్ధన్యుడయినాడు.
[టాగూరు తోటమాలిలోని కవితకు నా తెలుగుసేతకొద్దిమార్పుతో]
===========================================

No comments:

Post a Comment